కొందుర్గు, అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో పల్లెలన్నీ పచ్చలహారంగా మారుతున్నాయి. గ్రామ రోడ్లు, ప్రతి వీధితో పాటు ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. ఏటా హరితహారం కింద మొక్కలు నాటడంతో గ్రామాలన్నీ పచ్చగా కనువిం దు చేస్తున్నాయి. మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో మరో మొ క్కను నాటి పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. నిత్యం నీళ్లు పోస్తూ ఎప్పటికప్పుడు మొక్క చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. వాటికి ట్రీ గార్డ్లను ఏర్పాటు చేసి మేకలు, గొర్రె లు, పశువుల నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధతో మొక్కలను కాపాడుతుండటంతో ఏపుగా పెరిగి పచ్చని పల్లెలుగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రానగర్ గ్రామంలో…
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో నిండిపోయాయి. ప్రస్తుత సంవత్సరం గ్రామ రోడ్డు పక్కల నాటిన మొక్కలు 600, ప్రభుత్వ పాఠశాలలో 500, ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున 2000, గ్రామంలోని అంతర్గత రోడ్ల వెంట 600, గుర్రంపల్లి రోడ్డుకు 1250, పల్లె ప్రకృతి వనంలో 600, వైకుంఠధామంలో 150, డంపింగ్ యార్డులో 150 మొక్కలను నాటి సంరక్షిస్తున్నా రు. ఎండాకాలంలో చెట్లు మంచి నీడనిస్తున్నాయని, స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంతో ఇంద్రానగర్ రూపురేఖలు మారాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం..
గ్రామంలో నాటిన ప్రతి మొక్కనూ సం రక్షిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఏటా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నాం. గ్రామ రోడ్డుతోపాటు వీధులు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతున్నాం. నాటిన మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశాం. మొక్కలు ఏపుగా పెరిగి సుందరంగా కనిపిస్తున్నాయి.