కులకచర్ల, సెప్టెంబర్ 29 : మండల పరిధిలోని ఈర్లవాగుతండాలో పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. రూ. 35లక్షలతో గ్రామంలో వివిధ రకాల పనులు నిర్వహించారు. పంచాయతీలో 1425కి పైగా జనాభా, 230పైగా కుటుంబాలు ఉన్నాయి. 882 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీతో పాటు హర్యనాయక్తండా, లక్యనాయక్తండా, గుబ్బడితండా,రుక్యనాయక్తండా(హజ్యనాయక్తండా), లక్ష్మ్యనాయక్తండా, పాచ్చావ్కుంట 7 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రోజు వివిధి అభివృద్ధి పనులను నిర్వహిస్తూ గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. చౌడాపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న ఈర్లవాగుతండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, పచ్చదనం, పరిశుభ్రతలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నది. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పడింది. గ్రామం నుంచి ఇతర తండాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించింది. అన్ని పంచాయతీలకు ప్రతి నెల నిధులను కేటాయిస్తున్నది.
నర్సరీ ఏర్పాటు…
గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్కల రక్షణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వనసేవకుడిని నియమించారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను హరితహారం కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.
కంపోస్ట్ షెడ్నిర్మాణం
గ్రామంలో కంపోస్ట్ షెడ్ నిర్మాణం చేపట్టి సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు.
వైకుంఠధామ నిర్మాణం పూర్తి
ఈర్లవాగుతండా గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
పరిసరాల శుభ్రతకు చర్యలు
గ్రామ పంచాయతీలో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ద్వారా ఇద్దరు కార్మికులను నియమించి పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించడంతో పాటు గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్ ద్వారా ప్రతి వీధిలో తిరుగుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అనుబంధ గ్రామాల్లో పరిసరాల శుభ్రతకు కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు అందజేయగా తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా
ప్రభుత్వం గ్రామాలకు తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నది. దీంతో గ్రామ పంచాయతీలో నీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమైంది.
కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు
ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా రైతులకు పశువుల పాకలు, కల్లాలు వంటివి నిర్మించుకుంటున్నారు. మురుగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. కల్వర్టులను కూడా నిర్మించారు.
ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నాం
గ్రామస్తుల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చే నిధులతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. ఇప్పటికే 90శాతం పనులు పూర్తిచేశాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. పల్లె ప్రకృతివనం పూర్తిచేసినం. డంపింగ్ యార్డు కూడా ఏర్పాటు చేశాం.
గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. గ్రామంలో గతంలో కంటే ప్రస్తుతం సమస్యలు తీరాయి. పల్లె ప్రగతి ద్వారా అన్ని పనులు పూర్తి చేశాం. ప్రభుత్వం ద్వారా గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.