హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా తిరిగి ఉభయ సభలు సమావేశం కావాల్సి ఉంటుంది.