చెన్నై : తమిళనాడులో నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు.. 6,357 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో 5,398 మంది పురుష అభ్యర్థులు, 956 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హాసన్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎల్ మురుగన్, నటి ఖుష్బూ సుందర్తో పాటు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల అధికారులు నామినేషన్లను శనివారం పరిశీలించనుండగా.. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఏప్రిల్ 6న పోలింగ్, మే 2న కౌంటింగ్ జరుగనుంది.