అవును.. ఆరెంజ్ జ్యూస్ తాగడం డెమెన్షియా(చిత్తవైకల్యం) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ నారింజ రసం తాగడం వల్ల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తగ్గుతున్నాట్లు తెలిసింది. చిత్తవైకల్యంను అల్జీమర్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా వృద్ధాప్య జీవితంలో ప్రజలను ప్రభావితం చేస్తుంది. 2015 లో ప్రపంచవ్యాప్తంగా 46.8 మిలియన్ల మందికి చిత్తవైకల్యం ఉందని అంచనా. 2050 నాటికి ఈ సంఖ్య 131.5 మిలియన్ల మందికి పెరుగుతుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి, చిత్తవైకల్యం రావడానికి వ్యతిరేకంగా మీ మెదడును కాపాడుకోవడం అనేది మీకు చాలా ముఖ్యం.
న్యూరాలజీ అనే పరిశోధనా పత్రిక ప్రచురించిన దాని ప్రకారం.. ఓ పరిశోధనా బృందం.. యునైటెడ్ స్టేట్స్ నుండి సుమారు 28,000 మంది పురుషుల డేటాను సేకరించి, వారి వారి పండ్లు, కూరగాయల వినియోగాన్ని 1986 మరియు 2002 మధ్యకాలంలో ట్రాక్ చేసింది. అలాగే వారందరి అభిజ్ఞా పనితీరు విషయాల డేటాను కూడా సేకరించి, వాటిని వారు తీసుకుంటున్న పండ్లు, కూరగాయల వినియోగంతో పోల్చారు. అయితే ప్రతిరోజూ ఒక చిన్న గ్లాసు నారింజ రసం తాగిన పురుషులతో పోలిస్తే… అప్పుడప్పుడూ అంటే నెలకు ఒకటి కంటే తక్కువ సార్లు నారింజ రసం తాగినవారు పేలవమైన అభిజ్ఞా, ఆలోచనా నైపుణ్యాలను కలిగి ఉన్నారని తెలిసిందట. అంటే నారింజ రసం తాగే వారిలో 47% శాతం అభిజ్ఞా, ఆలోచనల పనితీరు మెరుగ్గా కనిపించాయని అధ్యయనం నిర్ధారించింది.
అంతేకాదు.. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న వారి మెమరీ ఫంక్షనాలిటీ.. కూరగాయలు తిన్న పురుషులు మెమరీ కార్యాచరణల కంటే మెరుగ్గా ఉందని కూడా అధ్యయనం కనుగొంది. అంటే 34% వరకు. నిజానికి ఈ అధ్యయనం కోసం ఉపయోగించి పండ్లు, కూరగాయలు అన్నింటిలో అవసరమైన విటమిన్లు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు బాగా ఉన్నాయి. ఇవి మెదడును రక్షించడంలో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి.
కానీ.. ఆరెంజ్ జ్యూస్ లో డయాబెటిస్ను నివారించే ఇతర కూరగాయలలోని ఖచ్చితమైన విటమిన్లు, పోషకాలు లేకపోయినా.. వీటిలో పుష్కలంగా లభించే విటమిన్- సి, ఫ్లేవనాయిడ్లు ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. విటమిన్- సి అనేది మెదడులో చిత్తవైకల్యానికి కారణమయ్యే టాక్సిక్ ప్రోటీన్ కంకరలను కరిగించగలిగేది. కాబట్టి, మేం చెప్పచ్చేదేంటంటే.. రోజుకు ఒక గ్లాసు నారింజ రసం తాగడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.