అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్నారు. EAPCET-2021 పరీక్షలు 2021, ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 29 వరకు జరపాలని ప్రతిపాదించారు.
నోటిఫికేషన్ జూన్ 24న వెలువడనున్నది. కాగా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 26, ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి ఆలస్య రుసువు లేకుండా చివరి తేదీ – జులై 25 . ఆలస్య రుసువుతో ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 6 నుంచి ఆగస్టు10 వరకు రూ.1000, ఆగస్టు11 నుంచి ఆగస్టు 15 వరకు – రూ.5000, ఆగస్టు16 నుంచి ఆగస్టు 18 వరకు – రూ.10,000, ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ జరగనున్నది.