కందుకూరు, ఆగస్టు 5 : మండల పరిధిలోని దాసర్లపల్లిలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. దివంగత జనార్ధన్ శర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ శుక్రవారం చండీ హోమం నిర్వహించనున్నారు. గత వారం రోజులుగా నిర్వహించిన కోటి కుంకుమార్చన గురువారంతో ముగియగా, శుక్రవారం 108వ చండీ హోమం నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసం ప్రస్తుతం కరోనా విలయతండవం చేస్తున్న సమయంలో ప్రపంచానికి పట్టిన విషవాయువు తొలిగిపోవాలని అమ్మవారికి ప్రత్యేకంగా హోమ సహిత కోటి కుంకుమార్చన నిర్వహించినట్లు రాజుశర్మ తెలిపారు. కార్యక్రమంలో వినాయక రావు, సర్పంచ్ పొలెమోని బాలమణి అశోక్, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, దయాకర్, క్రిష్ణయ్య, గ్రామ పంచాయతీ సభ్యులు,పండితులు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.