గజ్వేల్, జూలై 16 : పట్టణంలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా యి. ఆలయ ప్రధానార్చకుడు చాడ నందబాలశర్మ ఆధ్వర్యం లో అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించి, చండీ పారాయణాలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్ బాలమణీశ్రీనివాస్రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం గోపూజ, ప్రత్యేక అర్చనలు, చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఆదివారం గజ్వేల్, క్యాసారం రాజిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలంతా గజ్వేల్ మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం జరుగనున్న బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి హరీశ్రావుకు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు.
బోనాల ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్
పట్టణంలోని ఒకటవ వార్డు (లింగారెడ్డిపల్లి)లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్సు పాల్గొన్ని, అమ్మవారికి పూజలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్ విజేందర్రెడ్డి పాల్గొన్నారు.