హుజూరాబాద్/ జమ్మికుంట, సెప్టెంబర్ 27: ‘ఉద్యమ సారథిగా కేసీఆర్ ప్రాణాలను పణంగా బెట్టి రాష్ర్టాన్ని సాధించారు. అధికారం చేపట్టి దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. ఆయన వ్యక్తి కాదు.. మహోన్నత శక్తి’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి కీర్తించారు. దేశ ప్రజల బతుకులు బాగుపడా లంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ‘నాడు కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర సాధనకు జెండాలు పట్టినం. నేడు దేశం కోసం మళ్లీ జెండాలు పడుతం. ఆయన వెంట నడుస్తం.’ అని స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. మొద ట హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపసాయి గార్డెన్లో.. తర్వాత జమ్మికుంట కాటన్ మా ర్కెట్ యార్డు ఆవరణలో 3051 మందికి ఆస రా పింఛన్ మంజూరు పత్రాలు, 157 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 27 మందికి 7.18 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి నెలా 45 వేల మందికి 10 కోట్ల పింఛన్లను అందిస్తున్న కేసీఆర్కు రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. ఇక్కడి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి ఎన్నికైన ఈటల ఒక్క రూపాయి అయినా తెచ్చారా..? అభివృద్ధి చేశారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టే పార్టీని తరిమికొట్టాలని, మత చిచ్చ పెట్టే బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే ప్రభుత్వానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వమని, కేసీఆర్ ప్రజల నాయకుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో దళిత బంధులాంటి పథకాలు అన్ని వర్గాలకు అందేలా కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందని, సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షలు అందించనున్నారని చెప్పారు. హుజూరాబాద్లో అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు లబ్ధిదారులంతా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.