కమాన్పూర్, మార్చి 13: తెలంగాణ జాగృతి, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాగృతి జిల్లా కో-కన్వీనర్ బొజ్జ పూర్ణలత ఆధ్వర్యంలో కమాన్పూర్లోని ఆదివరాహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, జాగృతి మంథని నియోజకవర్గ కన్వీనర్ దుర్గం విశ్వనాథ్, కో-కన్వీనర్ కుడుదుల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ మల్యాల రాంచంద్రంగౌడ్, మేకల సంపత్యాదవ్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇంతియాజ్, సర్పంచులు నీలం సరిత, తాటికొండ శంకర్, ఎంపీటీసీ కోలేటి చంద్రశేఖర్, నాయకులు రాచకొండ రవి, కొమురయ్య, గొడిసెల సంపత్, అబ్బిడి సంతోష్రెడ్డి, బొజ్జ రాజసాగర్, రాచకొండ చంద్రమౌళి, గుర్రం లక్ష్మీమల్లు, పొనగంటి కనకయ్య, దామెర సంపత్, పెండ్లి నారాయణ, పిడుగు ఆంజనేయులు, బంగారు గట్టయ్య, కొలిపాక శంకర్, అనవేన భూమయ్య, కందుల మధు, అమీర్ఖాన్, జంగపెల్లి లక్ష్మణ్, కాస రవి, ఆకుల బాపు, పిట్టల స్వామి, సాన సురేశ్, భూంపెల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కమాన్పూర్లో ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు సర్పంచ్ నీలం సరిత పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొజ్జ రాజసాగర్, నాయకులు కమ్మగోని అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, మార్చి 13: మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతిపెద్ది కిషన్రెడ్డి, జాగృతి జిల్లా కో కన్వీనర్ తిత్తుల శ్రీను, మండలాధ్యక్షుడు మండల రాజేందర్, యూత్ అధ్యక్షుడు అలువోజు రాకేశ్, సర్పంచుల, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు నూనె కుమార్, అల్లం తిరుపతి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, పీఏసీఎస్ చైర్మన్ పోతిపెద్ది రమణారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ హకీం, సర్పంచులు సంపత్రావు, మేడగోని సతీశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బియ్యాని సదానందం, ఎర్రం సదానందం, పర్ష శ్రీను, గాదం శ్రీనివాస్, రామగల్ల మధుకర్, తాత బాలు, బీ రాము, గుట్ల రవీందర్ చల్ల సమ్మయ్య, అలువోజు రవీందర్, ఎర్రం సదయ్య, తోట సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్రూరల్, మార్చి13: కనుకులలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఇక్కడ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సర్పంచ్ పోలు అంజయ్య, రామునిపల్లి ఉప సర్పంచ్ రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుర్రం శివ, పురెళ్ల శ్రీనివాస్, శివ, కర్రె కుమార్, తుమ్మ రాజేశం, బొల్లం కుమార్, గరిగంటి కుమార్, కాంపెల్లి రాజేశం, మద్దెల రాజేశం, అంగడి ఎల్లయ్య, సురుగు శ్రీనివాస్, అంగడి రాజయ్య తదితరులున్నారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 13: పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్గౌడ్ మొక్కలు నాటారు. అంతకు ముం దు గౌరెడ్డిపేటలో ఉపాధిహామీ పనుల్లో కూలీల మధ్య కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్ ఎద్దు కుమారస్వామి, మాజీ సర్పంచ్ మందల రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సలేంద్ర రాములుయాదవ్, నాయకులు శ్రీనివాస్, ఉత్కం ప్రదీప్, పోసాని సతీశ్, దాగేటి సాగర్, బూరం సంతోష్, దాగేటి ప్రశాంత్, వంశీ, భరత్ ఉన్నారు.
పెద్దపల్లి టౌన్,మార్చి13: పట్టణంలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం చేసి, కేక్ తినిపించారు. వేడుకల్లో జాగృతి రాష్ట్ర నాయకుడు కండెం సురేశ్, బండారు శ్రీనివాస్గౌడ్, మందల రాంరెడ్డి, నర్సింహారెడ్డి, సలేంద్ర రాములు, జూపాక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మార్చి13: మంగపేటలో నల్ల యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్ల్లు పంచారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో నల్ల యువసేన మండలాధ్యక్షుడు సువర్ణ బిట్టు, యూత్ సభ్యులు సాయిగౌడ్, రంజిత్, వంశీ, సాయితేజ, హనుమంతు, కిష్టయ్య పాల్గొన్నారు.
రామగిరి, మార్చి 13: సెంటినరీకాలనీలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, జడ్పీటీసీ మేదరబోయిన శారద కుమార్ హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థ, కార్మికులకు పూర్వవైభవం తీసుకురావడంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కారుణ్య నియామకాలు సాధించడంలో ఆమె కృషిని కొనియాడారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, నరేశ్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ ఆసం తిరుపతి, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు ధర్ముల రాజసంపత్, నాయకులు పుల్లెల కిరణ్, బుర్ర శంకర్, మేడగోని రాజన్న, మారగోని కుమారస్వామి, బర్ల కుమార్, వేగోలపు మల్లయ్య, కొంరయ్య, మల్యాల మోహన్, ప్రశాంత్, రాజేశ్, టీబీజీకేఎస్ నాయకులు అల్లం రమేశ్, గంధం శ్రీనివాస్, సహదేవ్, వినయ్, శ్రీకాంత్ ఉన్నారు.
అంతర్గాం, మార్చి 13: మండల కేంద్రంతోపాటు రామగుండంలోని తబితా ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మండల జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకల్లో మండలాధ్యక్షులు కొల్లూరి సమరం, కాంపెల్లి నవీన్, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.
జూలపల్లి, మార్చి 13: వడ్కాపూర్లోని శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపం వద్ద కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్రెడ్డి కలిసి మొక్కలు నాటారు. ఇక్కడ వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, పాటకుల అనిల్, ఉప సర్పంచ్ అడువాల తిరుపతి, కూసుకుంట్ల రాంగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓదెల, మార్చి 13: ఓదెల మండలంలోని కొలనూర్లో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంచారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, ఆర్బీఎస్ బాధ్యుడు బండారి ఐలయ్య, నాయకులు కర్ర మహేందర్ రెడ్డి, సాత్తూరి రాజేశం, సుధాకర్రెడ్డి, కొమురయ్య, ప్రభాకర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.