నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ (డీసీజీసీ)
ఎన్సీఈఆర్టీఈ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఈపీఎఫ్ఈ) దీన్ని నిర్వహిస్తుంది.
కోర్సు మాధ్యమం: హిందీ, ఇంగ్లిష్ మీడియంలలో ఎన్సీఈఆర్టీఈ అందిస్తుంది.
ఈ కోర్సు పాఠశాల ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్స్, స్కూల్ అడ్మినిస్ట్రేటర్లకు ఉపయోగపడుతుంది.
ప్రోగ్రామ్ వ్యవధి 12 నెలలు.
అర్హత: డిగ్రీ పూర్తిచేసిన ఉపాధ్యాయులు, టీచింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం రెండేళ్ల అనుభవం ఉండి ప్రస్తుతం వృత్తిలో కొనసాగనివారు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి మార్కులతో పీజీ (సైకాలజీ/ ఎడ్యుకేషన్/ సోషల్ వర్క్/ చైల్డ్ డెవలప్మెంట్/ స్పెషల్ ఎడ్యుకేషన్) పూర్తిచేసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. కనీసం ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
కోర్సు అందించే సంస్థలు: న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఈ), రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ -అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మై సూర్, షిల్లాంగ్లలో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. మొత్తం 50 సీట్లు ఉన్నాయి.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన వారికి ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 5
వెబ్సైట్: https://ncert.nic.in