మానవ సమాజం నిరంతర చలనశీలమైనది. పరిణామశీలమైనది. చలన శీల సమాజాన్ని నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, నడిపించాలనేది కేసీఆర్ సూత్రం. అందుకే ఆయన ఉద్యమం తెలంగాణ సాధనతో ఆగిపోలేదు. అనేక రూపాలలో అనేక దశలుగా సాగిపోతూనే ఉన్నది. ఎప్పటికీ ఏదో ఒక విప్లవాన్ని ఆయన కాంక్షిస్తుంటారు. సమాజానికి ఏది అవసరమో బోధించి, ఆ దిశగా నిర్దేశం చేయడం నాయకుడి కర్తవ్యమనేది కేసీఆర్ మేధావులకు చెబుతుంటారు. వివిధ రంగాల నిపుణులతో ఆయన మేధోమథనం సాగుతూనే ఉంటుంది. కేసీఆర్ ఎవరితో చర్చించినా తన లక్ష్యం, మార్గం వీడరు. తన లక్ష్య సాధనకు అవసరమైన సలహాలనే స్వీకరిస్తుంటారు. మనం వ్యవసాయ విప్లవం మధ్యలో ఉన్నామనీ, కేసీఆర్ ఒక దిశగా నడిపిస్తున్నారనేది చాలా మందికి తెలువదు. గ్రామీణ విప్లవమూ అంతే. అంతర్జాతీయ సమాజంతో పోటీ పడుతూ నాలుగవ పారిశ్రామిక విప్లవాన్ని ప్రవేశ పెడుతున్నారు.
బయో డైవర్సిటీ లేకపోతే.. వాతావరణ, పర్యావరణ సమతుల్యత లేకపోతే.. మనిషి జీవించే పరిస్థితి ఉండదు. మనం ఎంత అభివృద్ధి సాధించినా జీవించగలిగే పరిస్థితి లేకపోతే ముందుతరాలు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. హరితహారం ఒక్కటే దీనికి పరిష్కారం.
– కేసీఆర్