PAN-Aadhar Link | తమ ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డ్ నంబర్లను అనుసంధానం చేసుకోవాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కోరింది. వచ్చే సెప్టెంబర్ 30వ తేదీ లోపు వాటిని అనుసంధానించుకోవాలని, లేని పక్షంలో బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది.
సెప్టెంబర్ 30 లోగా ఆధార్ కార్డ్తో అనుసంధానించని పాన్ కార్డ్ను ఇన్ ఆపరేటివ్గా పరిగణిస్తామని తెలిపింది. ఇన్కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడంలోనూ, ఆన్లైన్ లావాదేవీల్లోనూ ఆ పాన్ కార్డును వాడటానికి అనుమతించబోమని వెల్లడించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ఆధార్తో పాన్ కార్డ్ అనుసంధానాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఇంతకుముందు మార్చి 31 వరకు ఉన్న గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
ఎస్సెమ్మెస్ లేదా ఇన్కం టాక్స్ విభాగం వెబ్సైట్లోకి గానీ వెళ్లి రెండు పత్రాలను అనుసంధానం చేయొచ్చు. UIDPAN<12-digit Aadhaar number><10-digit PAN> అని టైప్ చేసి 567678 లేదా 56161 నంబర్లకు ఎస్సెమ్మెస్ పంపాలి. ఒకసారి మెసేజ్ పంపితే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం అవుతుంది.
తమ ఖాతాదారులు ఇన్కంటాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్. గవ్. ఇన్ అనే వెబ్సైట్కు వెళ్లి… అవర్ సర్వీసెస్లో లింక్ ఆధార్ అని క్లిక్ చేయాలి. అటుపై పాన్, ఆధార్ నంబర్లు, ఆధార్ కార్డు ప్రకారం పేరు నమోదు చేయాలి. తదుపరి మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత లింక్ ఆధార్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే సరిపోతుంది.