ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు, 50 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ మినహా మిగిలిన నిర్మాణాలన్నీ భూగర్భంలోనే ఉంటాయి. ఈ ప్రాజెక్టు ఓ భూగర్భ అద్భుతం. సర్జ్పూల్, పంప్హౌస్లు సైతం భూగర్భంలోనే నిర్మాణమవుతున్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతు వరకు ఉన్నాయి. సర్జ్పూల్ సగటు లోతు సుమారు 75 మీటర్లు. రిజర్వాయర్లను కలిపే ప్రధాన కాలువలకు 62.21 కిలోమీటర్ల మేర సొరంగమే దరి. తెలంగాణ గడ్డపై మరో భగీరథ సంకల్పం పాలమూరు- రంగారెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతలకు దీటుగా భూగర్భ అద్భుతం ఆవిష్కరణకు సిద్ధమవుతున్నది. దిగువన పారుతున్న కృష్ణమ్మను ఎగువకు ఎత్తిపోసి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పరుగులు పెడుతున్నది. సుమారు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలమందికి తాగు నీరందించే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఈ ఏడాదిలోనే సిద్ధం కానున్నది.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు నల్లగొండలోని భూములను సస్యశ్యామలం చేసే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి. తెలంగాణ తలరాతను మార్చేందుకు, ఉమ్మడి పాలకులు చేసిన పాపాలను కడిగేందుకు.. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్లో కొత్తరూపు సంతరించుకున్న మరో ఎత్తిపోతల పథకం ఇది. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి కృష్ణాజలాలను ఒడిసిపట్టి రోజుకు 2 టీఎంసీలను సుమారు 500 మీటర్ల పైకి ఎత్తిపోస్తూ 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. భూగర్భ అద్భుతమైన పాలమూరు-రంగారెడ్డి ఈ ఏడాదే ఎత్తిపోతకు సిద్ధమవుతున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూగర్భ అద్భుతం. రిజర్వాయర్లు, 50 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ మినహా మిగతా నిర్మాణాలన్నీ భూగర్భంలోనే ఉంటాయి. సర్జ్పూల్, పంప్హౌస్లు సైతం భూగర్భంలోనే నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ భూ ఉపరితలం నుంచి సగటున వందమీటర్ల లోతు వరకు ఉన్నాయి. సర్జ్పూల్ సగటు లోతే 75 మీటర్లు కావడం విశేషం. ఇది పూర్తిగా భూగర్భంలోనే ఉంటుంది. రిజర్వాయర్లను కలిపే ప్రధాన కాలువలు సైతం 62.21 కిలోమీటర్ల మేర భూగ ర్భం నుంచే టన్నెల్లో పారుతూ ఉంటా యి. ప్రాజెక్టులో రిజర్వాయర్లు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్నులు, సబ్స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ మాత్రమే భూఉపరితలంపై కనిపిస్తాయి. పంప్హౌస్లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్ ద్వారా సగటున కిలోమీటర్ వరకు ప్రయాణించాలి.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న మోటర్లను వినియోగిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోనే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బిగించిన 139 మెగావాట్ల మోటర్లను బాహుబలి మోటర్లుగా పిలుస్తున్నాం. అయితే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నాలుగు పంప్హౌస్ల్లో ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను బిగిస్తున్నారు. ఇవి ‘మెగా బాహుబలి’ మోటర్లుగా ఖ్యాతికెక్కుతున్నాయి. నాలుగు పంప్హౌస్లలో మొత్తం 31 మెగా బాహుబలి మోటర్లను వినియోగించనున్నారు. నాలుగు పంప్హౌస్లలో కలిపి రోజుకు రెండు టీఎంసీల నీటిని సుమారు 471 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తాయి. చివరగా ఉన్న కేపీ లక్ష్మీదేవిపల్లి పంప్హౌస్లో 75 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను వాడనున్నారు. ఈ మోటర్లను బీహెచ్ఈఎల్ తయారుచేస్తున్నది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రిజర్వాయర్లలో 70 టీఎంసీలు, కాలువల్లో సుమారు 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 80 టీఎంసీలతో 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మొద టి దశలో ఉదండాపూర్ వరకు పనులు పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇప్పటికే ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, డిండి ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందుతుండటం.. పాలమూరు కూడా తోడయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 20 లక్షల ఎకరాల మాగాణంగా మారుతుంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డబ్బు ఆదాలోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణంలోభారీస్థాయిలో కంకర, ఇసుక అవసరం. ఎర్త్డ్యామ్ (రిజర్వాయర్)లకు రివిట్మెంట్కు (రాతి కటకం) భారీగా రాతిని వాడాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్టులో పంప్హౌస్లన్నీ భూగర్భంలోనే నిర్మాణమవుతుండటంతో తవ్వకం సమయంలో భారీగా రాళ్లు వెలికి వస్తున్నాయి. ప్రాజెక్టు పనులకు రాళ్లు, కంకర, ఇసుకగా వీటినే వినియోగించేలా అన్నిచోట్ల ప్రత్యేకంగా క్రషర్లను ఏర్పాటుచేశారు. ఫలితంగా ఒక్కో క్యూబిక్ మీటర్ నిర్మాణానికి సుమారు రూ.194 ఆదా అయినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో సుమారు 1.30 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు జరుగుతున్నాయి. దీంతో సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదా అవుతున్నది.
వట్టెం: పంప్హౌస్, సర్జ్పూల్ నిర్మాణాలు 77శాతం పూర్తయ్యాయి. ఇక్కడ నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులు 85 శాతానికి పైగా జరిగాయి.
కరివెన: వట్టెం, కరివెన రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పిలుస్తారు. ఈ రెండు రిజర్వాయర్లలో కలిపి సుమారు 20 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. కరివెన (కురుమూర్తిరాయ) రిజర్వాయర్తోపాటు, లింక్ కెనాల్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. మొత్తం 36 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకుగానూ 32 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి.
ఉదండాపూర్: పంప్హౌస్, సర్జ్పూల్ పనులు 67శాతం జరిగాయి. రిజర్వాయర్ పనులు 54శాతం పూర్తయ్యాయి. మొత్తం 47 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకుగాను 27 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
తలాపునే 300 కిలోమీటర్ల మేర కృష్ణానది పారుతున్నా వలసల జిల్లాగా ‘నిర్లక్ష్యానికి గురిచేయబడిన’ జిల్లా పాలమూరు. సుమారు 35 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమున్నా తెలంగాణ సిద్ధించే నాటికి కనీసం రెండుమూడు లక్షల ఎకరాలకూ నీళ్లివ్వలేని దుస్థితి. తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక జిల్లా ప్రజలూ ఉద్యమించడంతో హడావుడిగా 2003, 2004లో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. నిధుల మంజూరులో వివక్షతో ఏండ్లు గడిచినా అవీ పూర్తికాలేదు. తెలంగాణ వచ్చాక త్వరత్వరగా నిధులు విడుదల చేసి వీటిని పూర్తిచేయడంతో పది లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందుతున్నది.
20 లక్షల ఎకరాలు 2005 నుంచి నలుగుతూ వచ్చిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2013 ఆగస్టులో నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి దిగిపోతూ జీవో ఇచ్చారు. దీనిని జూరాలపై నిర్మించాలని, నదిలో లక్ష క్యూసెక్కులు ప్రవహిస్తున్న సమయంలో 75 టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. 9 టీఎంసీ సామర్థ్యం మాత్రమే ఉన్న జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డికి నీటినందిస్తే రెండురోజుల్లోనే ఖాళీ అవుతుంది. ఈ దుస్థితిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలమూరు-రంగారెడ్డిని నీటి లభ్యత అధికంగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్కు మార్చుతూ రీ డిజైనింగ్ చేయించారు. నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి పథకాలతో ఇప్పటికే పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్లు, పంప్హౌస్లతోపాటు, కరివెన రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. మొత్తం 18 ప్యాకేజీల్లో ఈ పనులన్నీ వడివడిగా సాగుతున్నాయి. ఒక్కో రిజర్వాయర్, పంప్హౌస్ వద్ద వెయ్యిమంది సిబ్బంది 24 గంటలపాటు శ్రమిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి పనులను పూర్తిచేసి నీళ్లందిస్తామని అధికారులు ధీమాగా చెప్తున్నారు.
నార్లాపూర్: శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి 804 మీటర్ల ఎత్తులో నీటిని సేకరించేందుకు 2.2 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ కెనాల్ తవ్వకం పూర్తయింది. కెనాల్ నుంచి సర్జ్పూల్ వరకు నీటిని తీసుకెళ్లే మూడు సొరంగాల తవ్వకం పూర్తయింది. వీటికి కాంక్రీట్ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో టన్నెల్ పొడవు సుమారు 900 మీటర్లు. సర్జ్పూల్, డ్రాఫ్ట్ ట్యూబ్, పంప్హౌస్కు సంబంధించిన పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. 6.5 టీఎంసీల సామర్థ్యమున్న అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్ పనులు 75 శాతం పూర్తయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల రీచ్-2 మట్టికట్ట డిజైన్ను మార్చారు. ఇక్కడ మాత్రమే 0.67 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పెండింగ్లో ఉన్నది. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లే కాలువకు సంబంధించి 81 ఎకరాల భూ సేకరణపై ఉన్న న్యాయ వివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఏదుల: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనే అత్యం త వేగంగా పనులు జరుగుతున్న ప్రాంతమిది. ఇక్కడ 95శాతం పనులు పూర్తయ్యాయి. పంప్హౌస్, సర్జ్పూల్ నిర్మాణం తుదిదశకు చేరింది. మోటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. నీళ్లను పంప్హౌస్లోకి తీసుకొచ్చే రెం డు టన్నెళ్ల తవ్వకం పూర్తికాగా.. లైనింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 6.5 టీఎంసీల సామర్థ్యమున్న ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. రంగనాయకసాగర్ తరహాలో రిజర్వాయర్ మధ్యలో ఒక గెస్ట్హౌస్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఏదుల: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనే అత్యం త వేగంగా పనులు జరుగుతున్న ప్రాంతమిది. ఇక్కడ 95శాతం పనులు పూర్తయ్యాయి. పంప్హౌస్, సర్జ్పూల్ నిర్మాణం తుదిదశకు చేరింది. మోటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. నీళ్లను పంప్హౌస్లోకి తీసుకొచ్చే రెం డు టన్నెళ్ల తవ్వకం పూర్తికాగా.. లైనింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 6.5 టీఎంసీల సామర్థ్యమున్న ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. రంగనాయకసాగర్ తరహాలో రిజర్వాయర్ మధ్యలో ఒక గెస్ట్హౌస్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.