బడంగ్పేట, : పట్టుభద్రుల ఓటర్లను ఆకట్టు కునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు పక్కా ప్రణాళికతో ప్రచా రంలో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు ఊపిరి అంద నంతగా వాయువేగంతో విస్తృతంగా ప్రచారం నిర్వ హిస్తున్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కిందిస్థాయి కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు గల ప్రతి ఒక్కరూ బాధ్యతతో పట్టభద్రులను కలిసి ఓటును అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో వేరు వేరుగా సమావేశాలు నిర్వహిస్తు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. గతంలో బీజేపీ అభ్యర్థి పట్టుభద్రుల స్థానం నుంచి గెలిచి ఏంచేశారన్న అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కళ్లకు కట్టేలా వివరిస్తున్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంలోనూ సఫలికృతం అవుతున్నారు. పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న వైనాన్ని వెల్లడిస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రచారం బాధ్యతలను భుజాలపై వేసుకుని నాయకులను, కార్యకర్తలను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. వంద మంది పట్టభద్రులకు ఒకరి చొప్పున బాధ్యతను అప్పగించారు. మార్నింగ్ వాకింగ్లు, క్రీడా మైదానాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంద్, రైతు బీమా, పింఛన్లు తీసుకున్న వారి వద్దకు వెళ్లి టీఆర్ఎస్కు అండగా నిలువాలని అభ్యర్థిస్తున్నారు.