భోపాల్: గుజరాత్లోని సూరత్ నగరం నుంచి ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7 కోట్లు విలువైన 14 కిలోల బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను మధ్యప్రదేశ్లోని కట్ని స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు తప్తి గంగా ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణిస్తున్నారు. నిందితులు ప్లాస్టిక్ డబ్బాల్లో బంగారు ఆభరణాలను తరలించగా.. స్టేషన్ ప్రధాన గేటు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సోదా చేయగా.. బంగారు గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులతో పాటు ఇతర బంగారు వస్తువులను గుర్తించినట్లు తెలిపారు. ఆభరణాలు 14 కిలోల వరకు ఉంటాయని, మార్కెట్ విలువ రూ.7కోట్ల వరకు ఉంటుందని జీఆర్పీ స్టేషన్ ఇన్చార్జి ఆర్కే పటేల్ పేర్కొన్నారు. ముగ్గురూ గుజరాత్లోని సూరత్ నుంచి వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. అనంతరం రైల్వే పోలీస్ అధికారులు ఆదాయపు పన్నును, బిల్లులను పరిశీలించి.. జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.