కార్పొరేషన్, సెప్టెంబర్ 28: నగరంలో మేయర్ వై సునీల్రావు పుట్టిన రోజు వేడుకలను మంగళవారం టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉమెన్స్ డిగ్రీ కళాశాల వద్ద టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆమ ఆనంద్, సతీశ్, వెంకట్రావు, అంజన్రావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో మేయర్ను కార్యాలయ సిబ్బంది గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం మేయర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ కార్యాలయ సిబ్బంది ప్రకాశ్, ప్రశాంత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మేయర్ పాల్గొని కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గందె మాధవి, బోనాల శ్రీకాంత్, ఐలేందర్యాదవ్, నాయకులు వంగల పవన్, పెండ్యాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ దంపతులు మేయర్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు ఆరె రవిగౌడ్, మురళి, హరికృష్ణ తదితరులు ఉన్నారు. నగరంలోని అయ్యప్ప ఆలయంలో మేయర్ వై సునీల్రావు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటారు. కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ వృద్ధుల, దివ్యాంగుల ఆశ్రమంలో కార్పొరేటర్ ఎడ్ల సరితాఅశోక్ పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇక్కడ నాయకులు పొన్నాల రాజేశ్, పులి రమేశ్, జాడి శేఖర్, రంగోజు నరేశ్, మేకల దినేశ్, పావురపు శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. 23వ డివిజన్లో కార్పొరేటర్ అర్ష కిరణ్మయి-మల్లేశం దంపతులు మహిళా సంఘాల సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టి, మొక్కలు నాటారు. అనంతరం మొకలు నాటారు. 43వ డివిజన్ కార్పొరేటర్ సరిల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ దవాఖానలో అన్నదానం చేశారు. తెలంగాణచౌక్లో టీఆర్ఎస్ నాయకుడు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 54 కిలోల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ గంట కళ్యాణి, నాయకులు లెక్కల వేణు, సత్యనారాయణ, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భగత్నగర్లోని భగత్సింగ్ చౌరస్తాలో కార్పొరేటర్ తోట రాములు ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకల్లో మేయర్ వై సునీల్రావు పాల్గొని భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు వెంకటేశ్వర్రావు, కోటి, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. భగత్నగర్ ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ స్థానిక యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, మేయర్కు మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు పుష్పగుచ్ఛం అందజేసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది మేయర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీపీ సుభాష్, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్ పాల్గొన్నారు.