గువాహటి: ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజలపై వరాల జల్లు కురుస్తుంది. అలాగే ఇప్పుడు అసోం ప్రజలు కూడా వరాల జల్లులో తడిసి ముద్దవుతున్నారు. తొందర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో అక్కడి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు ఏకంగా రూ.5 తగ్గించింది. అలాగే మద్యంపై డ్యూటీని 25 శాతం తగ్గించడం విశేషం. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమాంత బిశ్వాస్ శుక్రవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. మార్చి-ఏప్రిల్ నెలల్లో అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి బీజేపీ నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది.