హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, మరోఐదు మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలువుదీరాయి. మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ఎన్నికైన సభ్యులు మధ్యాహ్నం 3 గంటలకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సమావేశ మందిరాల్లో ప్రమాణం చేశారు. అనంతరం 3:30 గంటలకు జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్/ చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక జరిగింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. ఎన్నికైన సభ్యులు, మేయర్ ఎన్నికలో ఓటుహకు కలిగిన ఎక్స్అఫీషియో సభ్యులను మాత్రమే అనుమతించారు. కరోనా పాజిటివ్ సోకి హోం ఐసొలేషన్లో ఉన్న సభ్యులు ఆన్లైన్లోనే ప్రమాణం చేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒకరికీ శానిటైజర్లు, మాస్లు, ఫేస్షీల్డు, గ్లౌజ్లు అందజేశారు. సమావేశ పక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్/చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక విధానాన్ని పర్యవేక్షించడానికి ప్రతిసమావేశానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా నియమించినట్టు ఎస్ఈసీ పార్ధసారథి తెలిపారు.