న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్కు కొవిన్ పోర్టల్లో చోటుకల్పించారు. అయితే ప్రస్తుతం స్లాట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న అపోలో దవాఖానలో మాత్రమే ఈ వ్యాక్సిన్ను వేస్తున్నారు. అది కూడా 45 ఏండ్లు పైబడినవారికి మాత్రమే ప్రస్తుతం దీనిని ఇస్తున్నారు. పైలట్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పరిమిత సంఖ్యలో ఈ వ్యాక్సిన్లను అపోలోకు అందిస్తున్నది. ఇందులో భాగంగా దవాఖానకు చెందిన 50 వేల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ఈ టీకా అందిస్తున్నారు.