పసిడి వర్ణపు కాంతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మెరిసిపోతోంది ! కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణతో ఆలయ గోపురాలు, , స్తంభాలు అన్నీ గంధపు వర్ణంలో ధగధగలాడాయి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ విద్యుద్దీకరణ పనులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విద్యుద్దీపాల ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో యాదాద్రి ఆలయం పసిడి వర్ణపు కాంతుల్లో వెలిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిPauseUnmuteLoaded: 56.63%Fullscreen