దేశంలో రక్షాబంధన్ సంబురాలు మొదలయ్యాయి. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జమ్మూకు సమీపంలోని సుచత్గఢ్ ఆక్ట్రాయ్ పోస్టు వద్ద అలాగే త్రిపురలోని అగర్తలలో బీఎస్ఎఫ్ జవాన్లకు శుక్రవారం స్థానిక యువతులు రాఖీలు కట్టారు. ఇక అగర్తలలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టారు.