టీటీడీ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ నగరంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయంలో మార్చి 12న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.