పచ్చదనంతో సిద్దిపేట జిల్లా పరవశించిపోతున్నది. సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ) ఆధ్వర్యంలో జరుగుతున్న పట్ణణ అభివృద్ధి పనులు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు.. తేజోవనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్లు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని తల్లీబిడ్డల అనుబంధంతో పోలుస్తూ తాజాగా మొక్కలతో ఏర్పాటు చేసిన ప్రతిమ మరింతగా ఆకట్టుకుంటుంది. ది సింబల్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ పేరిట మంత్రి హరీశ్రావు చేసిన ట్వీట్పై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.