ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని పలు ప్రాంతాలను బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. పంట పొలాలను, గుట్టలను తాకుతూ వెళ్తున్న పొగమంచు స్థానికులను ఆహ్లాదపరిచింది. రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.