సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆలయానికి బారులుతీరారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అటు గోల్కొండలోనూ అమ్మవారికి బోనాలు సమర్పించారు.