ఎలమందల ముఖాల్లో చిరునవ్వులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మొదటి విడుతలో పంపిణీ చేసిన గొర్రెల ఉత్పత్తి పెరిగి, ఆర్థికంగా బలోపేతం అవుతుండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. గొల్లకుర్మల కులవృత్తికి జీవం పోసేందుకు అమలు చేస్తున్న ఈ పథకం రెండో విడత కార్యక్రమం హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వేదికగా బుధవారం ప్రారంభమైంది.