రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ జలపాతాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూరం నూగూరు మండలం వీరభద్రపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యం ధార జలపాతం జలధారలతో పరవళ్లు తొక్కుతున్నది. పచ్చని కొండకోనల మధ్య 200 ఫీట్ల పైనుంచి జలపాతం జాలువారుతున్న దృశ్యాలు.. పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.