టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో మహిళా క్రికెటర్గా నిలిచింది. ఈమె కంటే ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్ 10వేల పరుగులు చేసింది.