ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కాలువలు జలకళను సంతరించుకోవడంతో మత్స్యకారులు చేపల వేటను సాగిస్తున్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా చందూర్లోని నిజాంసాగర్ కాలువలో చేపలు పడుతుండగా నాందేవ్ అనే వ్యక్తికి నాలుగున్నర ఫీట్ల పాపెర చిక్కింది. దాని బరువు సుమారు 5.5 కిలోలు ఉంది. ఇంతటి పొడవైన చేప లభించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి అని, దానిని మలుగు పాపెర అంటారని స్థానికులు చెప్తున్నారు. – చందూర్