నగర రహదారులపై ప్రమాదాలను, మరణాలను తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లే రైడర్తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. ఆ ఇద్దరూ హెల్మెట్ ధరించని యెడల చలాన్ జారీ చేస్తామన్నారు.
అయితే రైడర్తో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా పలు ప్రమాదాల్లో చనిపోయిన ఘటనలు చూశాం. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.