గులాబ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవాలయ ప్రాంగణంలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. సోమవారం కొండపై కురిసిన భారీ వర్షానికి మెట్ల మార్గం ద్వారా నీరు ఇలా ప్రవహిస్తూ జలపాతాన్ని తలపించింది. భారీ వర్షాల కారణంగా ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్లో ఒకటి రెండు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.