ఈ ఫొటో చూశారా ! రహదారికి ఇరువైపులా చెట్లతో రహదారికి తోరణం కట్టినట్టుగా కనులవిందుగా ఉంది కదూ !! రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది అనడానికి ఈ చిత్రం నిదర్శనం. మొదటి విడత హరితహారంలో భాగంగా జనగామ జిల్లా ఓబుల్కేశవాపూర్ – పసరమడ్ల రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఇలా ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రారంభమైన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఆరు విడతల్లో 210 కోట్ల మొక్కలు నాటడం, పునరుజ్జీవించడం పూర్తయింది. ఈ ఏడాది ఏడో విడతలో 20 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్