మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో కాళేశ్వరం జలాల రాకతో పాటు ఇటీవల కురిసిన వానలకు పాతాళగంగ ఉబికి వస్తున్నది. ఆకేరు, పాలేరు వాగులపై నిర్మించిన చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి. ఉల్లేపల్లి, బీచురాజుపల్లి, పురుషోత్తమయాగూడెం, బాల్నిధర్మారం, తాళ్ల ఊకల్, తానంచర్ల, రాంపూరం తదితర గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో నీరు భూములకు సమాంతరంగా కనిపిస్తున్నది.