బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు మంత్రులు తమ కుటుంబ సమేతంగా వచ్చారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు.