సాగువాటుకు నీరులేక నెర్రలు బారిన నేలలు ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఒచ్చినంక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు.. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నారుమళ్లతో నేలంతా పచ్చటి చీర పరిచినట్టుగా అందంగా కనిపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో కనిపించిందీ దృశ్యం.