తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్లో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఎగురవేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి అమర జవాన్లకు నివాళులర్పించారు.