సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం అల్లాడిన పాలమూరు నేడు ఎటు చూసినా పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నది. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మించడంతో జలకళను సంతరించుకున్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలోని ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్డ్యాం నిండి మత్తడి దుంకుతున్నది. చెక్డ్యాం మధ్యలో గంగాధరుడు కొలువుదీరిన దృశ్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నది.