టోక్యో: ఒలింపిక్స్ 69-74 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ పూజా రాణి క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 బౌట్లో ఆమె అల్జీరియా బాక్సర్ చాయిబ్ ఇచ్రాక్పై 5:0 తో గెలిచింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జ్లు పూజానే ఏకగ్రీవంగా విజేతగా తేల్చడం విశేషం. తన పవర్ఫుల్ పంచ్లతో ఆమె ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆమె మరో మ్యాచ్ గెలిస్తే చాలు.. ఇండియాకు పతకం ఖాయమవుతుంది.