మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని జలపాతం జాలువారుతున్నది. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టల మధ్య నీటి ఉధృతి పెరగడంతో జలకళ సంతరించుకున్నది. పచ్చని అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉన్న ఈ జలపాతం అందాలు, పక్షుల కిలకిలరావాలతో కనువిందు చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి