కుంట నిండా నీళ్లు.. నీళ్ల మధ్యన పచ్చని చెట్లు.. ఆ చెట్లపై తెల్లని పక్షులన్నీ ఒక్కచోట.. ఆ వెనకాల మబ్బుల్లోంచి మసక మసకగా కనిపిస్తున్న కొండ.. ఆహా! ఏమా ప్రకృతి సౌందర్యం, ఏమా సోయగం.. నాడు నెర్రెలువారిన తెలంగాణ.. నేడు పచ్చదనంతో తూలతూగుతున్నదని నిరూపించే మరో అద్భుత దృశ్యం వనపర్తి జిల్లాలో కనువిందు చేస్తున్నది. గోపాల్పేట మండలం చెన్నూరు గ్రామ శివారులో కనిపించిందీ చిత్రం.
– బందిగే గోపి, మహబూబ్నగర్ స్టాఫ్ ఫోటో గ్రాఫర్, నమస్తే తెలంగాణ