పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరిగి తన ప్రచారాన్ని ప్రారంభించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె వీల్ఛైర్లోనే రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడిన ఆమె.. తన జీవితంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నానని, అయితే ఎవరికీ తలొగ్గలేదని చెప్పారు. తన కాలికి అయిన గాయాన్ని ఉద్దేశించి మాట్లాడిన దీదీ.. గాయపడ్డ పులి అత్యంత ప్రమాదకరమని అన్నారు.