హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఉదయం ఇల్లందకుంట మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో మంతు సరోజన అనే మహిళ.. గెల్లు శ్రీను వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమైంది. తనకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది.. కానీ తనకు ఓ గూడు కల్పించాలని కన్నీరు పెట్టుకుంది. తనకు పెళ్లి కాలేదని తెలిపింది. చెల్లి పెళ్లి చేసిన తాను కష్టాల్లో ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం తన చిన్న తమ్ముడు శంకర్ ఇంట్లో ఉంటున్నానని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని గెల్లు శ్రీనివాస్ను సరోజన అభ్యర్థించింది. ఆమె కన్నీరు పెట్టుకోవడంతో గెల్లు శ్రీను కూడా ఉద్వేగానికి లోనయ్యారు.