తెలంగాణలో అటవీ సంపదను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్పలితాలను ఇస్తుంది. హరితహారంలో భాగంగా కొత్త మొక్కలను నాటడంతో పాటు ఇప్పటికే ఉన్న చెట్లను సంరక్షిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాదిలో వర్షాలు బాగానే పడటంతో.. మోడువారిన చెట్లు కూడా మళ్లీ చిగురిస్తున్నాయి. జీవితంపై కొత్త ఆశలను రేకితిస్తున్నాయి. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం సమీపంలో నమస్తే తెలంగాణకు కనిపించిందీ దృశ్యం.