చెన్నూర్, ఏప్రిల్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చెన్నూర్లో విశ్వ బ్రాహ్మణులు బుధవారం మామ్మాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మ భవన్లో ఉగాది నుంచి మామ్మాయి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కరోనా సీఎం కేసీఆర్ నుంచి త్వరగా కోలుకోవాలని బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు తంగళ్లపెల్లి శేఖరాచారి, సభ్యులు కట్ల శ్రీనివాసాచార్యులు, బొల్లంపల్లి లక్ష్మీనారాయణ, బి శ్రీనివాస్, కొండపాక చారి, ఏ సంజీవ్, ఏ జగన్, ఏ సతీశ్, నేరేడుగొండ రవి, విష్ణుమూర్తి, పీ శ్రీధర్, టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 21; కరోనా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ సీహెచ్పీలోని దుర్గాదేవి ఆలయంలో పిట్ కార్యదర్శి జే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆర్కేపీ సీహెచ్పీ ప్రాంగణంలోని దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించి దుర్గాదేవిని వేడుకున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప మనస్సున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. సింగరేణి కార్మికులను బార్డర్లోని సైనికులతో పోల్చిన గొప్ప మహా నాయకుడికి కరోనా రావడం బాధాకరమన్నారు. దుర్గామాత దీవెనలతో ఆయన త్వరగా కోలుకొని రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చొప్పరి రామస్వామి, కోల మోహన్, లక్ష్మణ్ బాబు, జాడి లలిత, ఆవుల మల్లమ్మ, గాండ్డ సత్తవ్వ, రత్నయ్య, రజిత, చిలుకమ్మ, రవళి తదితరులు పాల్గొన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులోని అభయాంజనేయ ఆలయంలో వార్డు కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్ పూజలు నిర్వహించి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, కొలిపాక మల్లికార్జున్, కుదిరె వెంకటేశ్, గాజుల శంకర్ పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. బుధవారం ఏరియాలోని పలు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ కరోనా నుంచి క్షేమంగా కోలుకుంటారని తెలిపారు. ఆయన ఏరియాలో పలు గనులు, డిపార్ట్మెంట్లపై నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జే. రవీందర్, ఓ. రాజశేఖర్, పిట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, గాలిపల్లి తిరుపతి, యుగేంధర్, కార్యకర్తలు, కార్మికులున్నారు.