హైదరాబాద్, అక్టోబర్ 23: దేశంలో అతిపెద్ద హెర్బల్ మెడిసిన్ తయారీదారు కార్ఖానా జిందా తిలిస్మాత్…శనివారం శత వసంతోత్సవాలు జరుపుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ నొప్పి నివారణ ఔషధం ‘జిందా తిలిస్మాత్ బామ్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. హెర్బల్ ఫార్ములేషన్తో తయారైన ఈ ఔషధంతో అన్ని రకాల నొప్పులు తగ్గించవచ్చునని తెలిపింది. వందశాతం నేచురల్ హెర్బల్ ఇంగ్రిడియెంట్స్తో ఈ జిందా తిలిస్మాత్ బామ్ను తయారు చేసినట్లు కంపెనీ మేనేజింగ్ పార్టనర్ సోహెల్ ఫారూఖీ తెలిపారు. మరోవైపు కంపెనీ ప్రచారకర్తగా సానియా మిర్జాను నియమించుకున్నది.