తిరువనంతపురం: కేరళను ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు జికా వైరస్ అల్లాడిస్తున్నాయి. తాజాగా మరో ఇద్దరికి జికా వైరస్ సోకింది. లక్షణాలు కనిపించిన వారిని పరీక్షించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. దీంతో కేరళలో నమోదైన జికా వైరస్ కేసుల మొత్తం సంఖ్య 48కి చేరింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. జికా వైరస్ను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కాగా, కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.