అహ్మదాబాద్: వరోరా-కర్నూల్ ట్రాన్సిమిషన్ లిమిటెడ్ (డబ్ల్యూకేటీఎల్) సంస్థను ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టును టేకోవర్ చేసుకోనున్నట్లు ఆదానీ ట్రాన్సిమిషన్ లిమిటెడ్ (ఏటీఎల్) శనివారం తెలిపింది. ఈ మేరకు ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో టేకోవర్ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది.
ఈ డీల్ విలువ రూ. 3,370 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందామని ఏటీఎల్ వెల్లడించింది. ఎస్సెల్, ఆదానీ గ్రూపుల మధ్య జరిగిన ఈ ఒప్పందానికి బ్యాంకులు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తప్పనిసరి కావాల్సి ఉంది.
ఈ ఒప్పందంపై ఏటీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో అనిల్ సర్దానా స్పందిస్తూ.. పశ్చిమం నుంచి దక్షిణానికి ఈ ట్రాన్సిమిషన్ కంపెనీ వ్యూహాత్మకంగా కీలకం అని పేర్కొన్నారు. 765 కేవీ ఇంటర్ కనెక్టర్తో దక్షిణభారతావనితో అనుసంధానిస్తుందన్నారు. ఈ కంపెనీని టేకోవర్ చేయడంతో దేశంలోని అన్ని రీజియన్లలో విద్యుత్ సేవలకు తమ సంస్థకు ప్రాతినిధ్యం లభించినట్లైందన్నారు.
ఈ సంస్థను టేకోవర్ చేయడంతో ఏటీఎల్ కంపెనీ మరిత బలోపేతం కావడంతోపాటు 20 వేల సీకేటీ కిలోమీటర్ల దూరం వరకు ట్రాన్సిమిషన్ లైన్ల నిర్మాణానికి లక్ష్యాలు ఖరారయ్యాయని అనిల్ సర్దానా పేర్కొన్నారు. 2022 నాటికి ఈ ట్రాన్సిమిషన్ లైన్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు.
వరోరా- కర్నూల్ ట్రాన్సిమిషన్ కంపెనీ 1750 సీకేటీ కిలోమీటర్ల మేరకు ట్రాన్సిమిషన్ లైన్లను అభివ్రుద్ధి చేసి నిర్వహించాల్సి ఉంటుంది. 765 కేవీ ఇంటర్ స్టేట్ ట్రాన్సిమిషన్ లైన్.. వరోరా-వరంగల్, చిలకలూరి పేట-హైదరాబాద్-కర్నూల్ లైన్లను అనుసంధానిస్తుంది.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!