న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ త్వరలో జర్మనీ కేంద్రంగా పని చేస్తున్న ఈఎస్జీ మొబిలిటీ సంస్థను టేకోవర్ చేయనున్నట్లు గురువారం వెల్లడించింది. ఈఎస్జీ మొబిలిటీ ఒక డిజిటల్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ ప్రొవైడర్గా ఉంది.
ఆటానమస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను అనుసంధానించడానికి డిజిటల్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ ప్రొవైడర్ ఉపకరిస్తుంది. ఈఎస్జీ మొబిలిటీని టేకోవర్ చేయడంతో వెహికల్స్ అనుసంధాన విభాగంలో కాగ్నిజెంట్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి.
ఈఎస్జీ మొబిలిటీ టేకోవర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జర్మనీ, అమెరికా, చైనాల్లో 1000 మంది ఆర్ అండ్ డీ స్పెషలిస్టులను నియమించుకోనున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 ఆటోమోటివ్ ఒర్జినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ (ఓఈఎం)ల్లో ఎనిమిది సంస్థలకు సేవలందించాలని కాగ్నిజెంట్, ఈఎస్జీ మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకున్నాయి.
2021 ద్వితీయ త్రైమాసికంలో ఈఎస్జీ మొబిలిటీ టేకోవర్ ప్రక్రియ పూర్తి కానున్నదని అంచనా వేస్తున్నారు. ఈ రెండు సంస్థల మధ్య టేకోవర్ బంధం వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు. ఈఎస్జీ మొబిలిటీని టేకోవర్ చేస్తే 2021లో కాగ్నిజెంట్ టేకోవర్ చేసిన సంస్థల్లో నాల్గవది. 2020 జనవరి నుంచి 13వ సంస్థగా నిలువనున్నది.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్