అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘ఇప్పట్లో ఎలక్షన్లేవీ లేవు. నువ్వుండేది రాష్ట్రం బయట. ఇక్కడ నీ పార్టీ అవసాన దశలో ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయాలెందుకు బాబూ.
ప్రజలను భయాందోళనలకు గురిచేసి శాడిస్టు ఆనందం పొందడానికి ఇన్ని వేషాలా. వ్యాక్సిన్లు తెప్పించగలిగే పరపతి ఉంటే ప్రయత్నించు. అనవసర రచ్చ ఎందుకు.’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘రుయా ఘటనను భూతద్దంలో చూపిస్తున్న పచ్చ బ్యాచ్ రమేశ్ హాస్పిటల్ లో అగ్నికి ఆహుతైన అభాగ్యుల గురించి, గోదావరి పుష్కరాల్లో బాబు ‘అదృశ్య పాదాల’ కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన 30 మంది గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పడానికి ఏదైనా పాయింటు ఉందా మీ దగ్గర. నక్కపిల్ల పుట్టి 4 వారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన జీవితంలో చూడలేదన్నదట. చిట్టి నాయుడు వ్యవహారం అలాగే ఉంది. సమీక్షలు, పరిపాలన గురించి సలహాలు ఇచ్చే స్థాయికి నువ్వింకా ఎదగ లేదు మాలోకం. ఇక్కడికొచ్చి ఒక హాస్పిటల్ ను దత్తత తీసుకుని సేవ చేయి. సొల్లు కబుర్లు మానేసి.’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.